Monday, December 20, 2010

దేవుడున్నాడు !

                   ఆరు ఏళ్ళ క్రితం ,ఒక ఆదివారం ఇంట్లో పని అయిన తరువాత  పన్నెండుగంటలకు కూర్చుని   పుస్తకం చదువుతున్నాను.
                                  
                                            చుట్టూ శూన్యం ఎక్కడ ఉన్నానో అర్ధమవలేదు.అంతట చీకటి అక్కడక్కడ మినుకుమినుక మంటూ చుక్కలు ,చుట్టూ చూస్తే ఎవ్వరు లేరు , అమ్మో! ఎక్కడకు వచ్చెను ?ఎవ్వరు లేరు ,తెలియని చోటికి వచ్చెను  వెళ్లిపోవాలి అని ప్రయత్నిస్తున్న,కానీ వెళ్ళాలని చూస్తే గాల్లో తేలుతున్నాను .భయంతో  చెమటలు పట్టాయి ఇంటిలో అందరిని పేరు పేరు నా  పిలుస్తున్న ఎవ్వరు పలకడం లేదు .పై పైకి వెళ్ళిపోతున్న ,చాల సేపు ప్రయాణం తరువాత తెల్లటి ప్రదేశానికి వచ్చెను .చుట్టూ చల్లగాలి ,అంత మంచు, నడుస్తున్నాను .ఎటునుంచి ఇంటికి వెల్లాల అనే ఆలోచనే !కొంతదూరం నడిచేను ,అంతే! ఎదురుగ శివ పార్వతులు నావైపే చూస్తున్నారు ,నాలో ఆనందం ,భయం ."దయచేసి నన్ను పంపించెయ్యండి ,నాకు అమ్మాయి ఉంది నాకోసం ఎదురు చూస్తా ఉంటది"అటు వైపునుంచి ఉలుకు లేదు పలుకులేదు .వాళ్ళ కాళ్ళ దగ్గకుర్చుని ఒకటే బతిమలుతున్న ,వారు మాత్రం ఏమి మాట్లాడకుండా ప్రసాంతంగా నావైపు చూస్తున్నారు .నాకళ్లలో నీళు,ఇంకా అక్కడనుంచి లేచి వారి చుట్టూ తిరిగి దారి కనపడద్దేమో అని వెతికేను ,ప్చ్ !నిరాశే ఏడుస్తూ మళ్ళి వారి దగ్గరకు వచ్చెను ,నా ప్రాణమంత మా అమ్మయి చుట్టూ ఉంది .మళ్ళి పంపించేయ్యమని బ్రతిమలేను .కొంతసేపటికి మళ్ళి నేను చీకటిలో , సూన్యంలో ఉన్నాను ,గాల్లో ప్రయాణం.           ఉలిక్కి పడి చుట్టుచుసేను పుస్తకంనా చేతుల్లోనే ఉంది . టైం చుస్తే ఒంటిగంట దాటింది ,ఒక్కసారే గుండె లబడబ్ చప్పుడు నాకే విన్పించింది టెన్షన్ తో వళ్ళంతా చమటలు పట్టాయి .హమ్మయ్య ! ఇంటిలోనే ఉన్నానా ?అంతా గుర్తు వచ్చింది ఒక్కసారే వళ్ళుజలతరించింది . ఇంటిలో అందరితో చెప్పెను, అచ్చర్య పోయారు.శివపార్వతులు ఎందుకు కన్పించారో నాకు అర్ధమవలేదు !కనీసం నేను తలుచుకోవడం కూద చెసెదన్ని కాదు, నిజంగా శివపార్వతులు మంచుకొండల్లోనే ఉంటారా!చాల కాలం వరకు ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోయా .అప్పటినుంచి ఏదో ఒక సంఘటనలు జరుగుతుండేవి .
  మా ఇంటిలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నే పుజిస్తారు .చిన్నప్పుడు ఎక్కువగా తిరుపతి తీసుకు వెళ్ళేవారు ,శివాలయాలకు తక్కువుగా తీసుకు వెళ్ళేవాళ్ళు.శివరాత్రి అప్పుడు మాత్రం తీసుకువెళ్ళేవారు . అందుకేనేమో పెద్దయ్యాక దేవుడంటే వెంకటేశ్వరస్వామి ,షిర్డీ సాయి బాబా నే ఎక్కువగా పూజ చేసేదాన్ని.అందరిలాగే నాకు పెద్ద డైలమ ,అసలు నిజంగా దేముడున్నాడా!ఎప్పుడు నాలో సంఘర్షణ,పైన సంఘటనతో నాకు దేముడున్నాడు అని నమ్మకమేర్పడింది .అప్పటినుంచి శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళటం ,ఏ కష్టమొచ్చిన ఓం నమః శివాయ అనుకోకుండా ఉండలేను .ఏ వూరు వెళ్ళిన శివాలయం వుంటే దర్శించుకుంట .శివుడు నాకు ఇష్ట దైవం అయ్యాడు.ఈ సంవత్స్తరం శివరాత్రి రోజే మా పెళ్లి రోజు కూడా అవడం చాల ఆనందగా వుంది .
                       
          మాములుగా అయితే  ఒక్క పూట కూడా తినకుండా  ఉండలేను .కాని కార్తీకమాసం ,శివరాత్రి కయితే  ఉపవాసము ఉండగలను .ఇదంతా మన సంకల్పబలమేమో !

Sunday, December 19, 2010

మా ఇంటి దాదా

నాన్న గారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉన్నాము .అప్పటికే అక్కవాళ్ళు కోత్త స్కూల్లో జాయిన్ అయ్యారు . నాకు నాలుగేళ్ళ వయసు ,అక్క వాళ్ళు చదివే స్కూల్లోనే నన్ను ఒకటవ తరగతిలో చిన్న అక్క తో పాటు ఆమె క్లాసు లో కొత్తగా జాయిన్ చేసేరు .కొత్త అయిన నేనేమి ఏడవలేదు అక్క వాళ్ళతో చక్కగా వెళ్ళెను .స్కూల్ లో నాతోటి పిల్లలు చాలామంది ఉన్నారు ,వాళ్ళందరిని చూస్తాఅక్కతో పాటు నుంచున్నాను .ఇంతలో క్లాసు లోకి మాస్టర్ వచ్చేరు .మాస్టర్ గారికి నన్ను అప్పచెప్పి అక్క వెళ్ళిపోయింది.మాస్టర్ గారు తెల్లగా, లావుగా పంచె కట్టుకుని ,పిలక ,నుదుటన పొడవాటి తిలకం,అయన పేరు శ్రీనివాసాచారి .నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టుకుని(నేను చాల బొద్దుగా ముద్దు ఉండే దాన్నంట) అయన టేబుల్ మీద కుర్చోపెట్టుకున్నారు.స్కూల్ అయిపోయాక అక్కవల్లతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను .మర్నాడు స్కూల్కి వెళ్ళాక మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టారు ,మిగతా పిల్లలందరూ బల్లల మీద కూర్చున్నారు.మాస్టర్ గారు జేబులోనుంచి పటిక బెల్లం ముక్కలు (పలకలుగా చిన్నవిగా ఉన్నాయి )నాచేతిలో పోసేరు ,నాకు బాగా నచ్చయి,తిన్నాను .
పిల్లలందరికీ బోర్డ్ మీద రాసి రాయమనేవారు .నాకయితే పలకమీద రాసిచ్చి దిద్దమనేవారు .నేను రోజు అయన టేబుల్ మీదే కుర్చునేదాన్ని ,రోజు పటికబెల్లం ముక్కలు ఇచ్చేవారు .నా స్కూల్ డేస్ మొదటి సంవత్సరం సంతోషంగా గడిచిపోయింది (ఈ మధ్య మా స్కూల్ ,అప్పట్లో మేము ఉన్న ఇల్లు అన్ని చూసి వచ్చెను .(అక్కడ రెండు ఏళ్ళ తరవాత వేల్లిపోయము ) మల్లి ఇప్పుడే చూడటము,నా సంతోషాన్ని మాటలతో చెప్పలేను . రెండో తరగతిలోకి వచ్చెను ,నన్ను అక్కని ప్రైవేటు కి పంపించేరు,నేను సైలెంట్ ,అల్లరి చేసేదాన్ని కాదు .అక్క అల్లరి చెప్పక్కరలేదు ,చాల గడుసు ,ఆటలు ,పాటలు.ఆమె ఫస్ట్ ఉండాలి .వేరే ఎవరికయినా వచ్చిందా కంటిచుపుతోనే భస్వం చేసేది . సన్నగా ,తెల్లగా ఉండేది ,స్టైల్ గ తయారవడం చాల ఇష్టం ,అమ్మ జడ వేసినాక చివర్లో నీళ్ళు తడిపి ఉంగరాలు వచ్చేలాగ తిప్పేది ,పౌడర్ టిన్నుమేము ఇల్లంతా పడేస్తామని అమ్మ పైన పెట్టేది ,మన" దాదా" గారికి అందేది కాదు,కానీ మొహానికి పౌడర్ రాసుకుని కాటుక పెట్టుకోవాలి ఏంచెయ్యాలి ?బియ్యం డబ్బా దగ్గరకు వెళ్లి చేతులు దాంట్లో పెట్టేసి ,చిన్న చేతులతో మొహమంతా పులుముకునేది .బియ్యంలో ఉన్న వైట్ డస్ట్ పేస్ మీద ,కాటుక తీసుకుని అమ్మకు తెలియకుండా ఫిష్ ఆకారంలో కళ్ళ చివరివరకు పుల్లతో దిద్దేది .
ప్రవేట్ క్లాసు లో ఫిఫ్త్ క్లాసు వరకు ఒక గ్రూప్ గా కుర్చోపెట్టేవారు .అందరికి క్లాసు వర్క్ ఇచ్చేవారు. టేబుల్స్ ,,తీసివేత, కూడికలు ఇచ్చేవారు . మనమందరం ఒక్కసారే మాస్టర్ దగ్గరకు వెళ్లి చుపిద్దము అని చిన్న అక్క మాతో చెప్పేది .నాది ఇంకా అవలేదు మీరంతా మెల్లిగా రాయండి అని చెప్పేది.నాది ముందు అయిపోయిన అమెది అవలేదేమో అని కుర్చునేదాన్ని ,మిగతా ఫ్రెండ్స్ అందరుకూడాస్లోవ్గా రాస్తా ఉండేవాళ్ళు .ఈలోపుచిన్నక్క వెళ్లి మాస్టర్ కి చుపించేసేది ,అందరికన్నా ముందు రాసినందుకు ఆమెని మెచ్చుకుని ,ఇంకా రాయనందుకు మిగతావారిని తిట్టేఅలా ఎందుకు చేసేవు అని అడిగే దైర్యం ఎవరికి ఉండేది కాదు ,ఒకవేళ ఎవరయినా అడిగితె వాళ్ళ పని అయిపోయేది .చిల్డ్రన్స్ డే కి ఆటల పోటీలు పెడితే ,నాకన్నా ముందు పరిగెత్తవద్దు అని సైగ చేసేది నేను నా ఫ్రెండ్స్ మణిమాల ,లక్ష్మి సరే అని తల ఉపే వాళ్ళం.నాకు ప్రైజ్ తీసుకోవాలని కోరిక ఉండేది ,కానీ ఏమి చేయలేకఎదాన్ని .తన ఫ్రెండ్స్ కి కూడా కళ్ళతో వార్నింగ్ ఇచ్చేది .అనిట్లో ఆమె ఫస్ట్ తనకే ప్రైజెస్. ఇంతచేసిన ఫ్రెండ్స్ అందరు ఆమె వెనుకే తిరిగేవాళ్ళు . ఇంటి లో కూడా ఆమె చెప్పినట్లే చెయ్యాలి ,లేకపోతె అందరితో పోట్లడేసేది.అమ్మ ,నాన్న లు ముద్దుగా "బెడగుండా రాక్షసి" అనిపిలిచేవాళ్ళకారెంబోర్డ్ ఆటలో ఆమెఓడిపోతుందిఅంటే , అన్ని కలిపేసి వెళ్లి పోయేది .ఓటమి అంగీకరించదు .నా రెండవ తరగతి అల గడిచింది ,కానీ ఇప్పుడు అవి అన్ని తీపి గుర్తులు.
పెద్దయ్యాక దాదాగిరి మానేసింది మా పండక్క.లీడర్ క్వాలిటీస్ మాత్రం ఉన్నాయి ,కాలేజీ లో కూడా పదిమంది ఫ్రెండ్స్ వెనక ఉండేవాళ్ళు , లేక్త్చురర్స్ ,స్నేహితులు బాగా ఇష్టపడేవారు .తెలివితేటలూ ఎక్కువని అందరు మెచ్చుకునేవాళ్ళు .అప్పటిరోజులు తలుచుకుని నవ్వుకుంట వుంటాము .ఇప్పుడు తను బాగా చదువుకుని మంచి జాబ్లో ఉంది.

Saturday, December 18, 2010

బొజ్జ గణపతి

నా చిత్తూర్ జ్ఞాపకాలు లో మరొకటి . బయటనుంచి అరుపులు ,కేకలు.నిద్రలో ఉన్నానేమో ఉలిక్కిపడి లేచాను ,టైం చూస్తే ఉదయం ఎడుగంటలూ ఆరోజు ఆదివారం స్కూల్ లేదు .బయటికి వచ్చి చూసేను .అప్పటికే అమ్మ గేటు లో నుంచుని వుంది.పక్కింటి సుబ్రహ్మణ్యం తన ఇద్దరి బార్యలని రోకలిబండ తో తన్నుతున్నాడు ,మద్డ్యలో వాళ్ళకున్న పొడవాటి కురులను మెలిపెట్టి నేలకేసి కొడుతున్నాడు .చుట్టూ జనం బొమ్మల్లా చూస్తున్నారు .అమ్మ కోపాన్ని ఆపుకోలేకపోయింది .అపూ !వాళ్ళమీద చెయ్య పడిందా మర్యాదగా వుండదు ,అనిఅరచింది .సుబ్రమణ్యం కూడా షాక్! రోకలిబడని పడేసి ఇంట్టిలోకి వెళ్లి తలుపు వేసుకున్నడు .చట్టువున్నవారు అమ్మని అభినందిన్చేరు .రోజ్జుఇదే గొడవ అమ్మకూడా పట్టించుకునేది కాదు మనకెందుకులే అనుకునేది ,ఆరోజు మాత్రం అదేబ్బలకి వారు బతకరేమో అని వారి విషయంలో కల్పించుకుంది అమ్మాంటే అచుట్టుపక్కల గౌరవం ఆఫీసర్ గారి వైఫ్ గ అందరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు . సుబ్రమణ్యం వాళ్ళుమాపక్క ఇంటిలోవుండేవారు ,వారిది పెద్ద లోగిలి ఇల్లు ,కంపౌండ్లోనే పది మగ్గలదాకవుందేవి .చీరలు నేస్తవుండేవారు ,పీలగాపోట్టిగా తెల్లగావుండే సుబ్రమన్యంకి బార్య నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు .బార్య మంచి హైటు మొకల్లవరకువుందే పొడవాటి కురులు, చెల్లెలు సరోజ ఇంక అందంగా వుంటుంది .ఈ పొట్టి హీరో మరదలినిఇష్టామంట ,నాకు !మీ చెల్లి ని ఇచ్చి పెల్లిచేయ్యండి లేకపోతే చచిపోతనని అనేవాడట !అలబార్యని హింసించేవాడు.నిజంగానే రొండు సార్లుఎట్టేమ్ప్ట్ చెస్తే దానితో ఆమె బయపడి పేరెంట్స్ ని చెల్లి ని బతిమాలి మంగల్యాన్ని రక్షించమని కోరిందంతా .వాళ్ళు ఒప్పుకోలేదు చివరికి ఎలాగైతేనేమి వప్పిచింది . తన కా పురాన్ని షేర్ చెయ్యలంటే ఎవరికిఇష్టం వున్నటుంది ,అది సొంత చెల్లితో !సరోజకి కష్టాలు ప్రారంబం ,అక్క సరిగ్గా తిండి పెట్టెకాదంట మాటలతో చేతలతో బాగా బాద పెట్తేదాంత .సరోజ కి ఒక బాబు పుట్టెడు కష్టాలు ఇంక ఎక్కువయ్యంత.సరోజతో మాట్లాడేవారే లేరు చుట్టుపక్కలఎవరితోను మాట్లాడనిచ్చేదికదంతా .బాధలు బరించలేక సరోజ ఎదురు తిరగడం మొదలుపెట్టింది .రోజు యుద్ధం అగోదవతో ఇద్దరినీ కొట్టడం మొదలు పెట్టేడు . వల్లామ్మయలు గీత లతా నాస్నేహితులు వాళ్ళతో ఆడుకుంటూ వుండేదాన్ని వాళ్ళింటిలో మగ్గాలమీదే నేస్తూవుంటే నాకుఅచ్చర్యంగా వుండేది !మగ్గాలు కాలిగా వున్నపుడు నెను ట్రై చేసేదాన్ని చాలకష్టంగా వుఉండేది .సరోజ కొడుకు మూడేళ్ళ వాడు ముద్దుగా బొద్దుగా చేరు బొజ్జతో వుఉండేవాడు .వాడంటే నాకు చాల ఇష్టం ,అసలు పిల్లలంటేనే నాకు ఇష్టం నావయసు ఎనిమిది , కాని పెద్దదని లాగ ఇంటి పక్క పిల్లలందరినీ అందరిని ఆదిచ్చేదాన్ని .గణపతిని మాఇంట్లో బొజ్జ గణపతి అని పిలిచేవాళ్ళం సరోజ కొడుకుఅని ఎవరు ఎతుకునేవారు కాదు .సరోజబాధలనిఅమ్మతో షేర్ చేసు కునేది .నెను ఎక్కువ గణపతి తోనే ఆడుకునేదాన్ని .అక్కాచెల్లెలు మంచి ముడ్లో వున్నప్పుడు వారి వంటకాలని మాకు పంపిస్తవుందేవాళ్ళు .మేము పక్క కృష్ణ జిల్లవాళ్ళం .వారి మునగాకు పోల్లింపువిత్ వేరుసేనగాపొడి ,పప్పు మునగాకు ,అవిసకు పోల్లింపు ఇలా రక రకరకాల వంటకాల వంటకాలు ఇస్తూ న్దేవాళ్ళు .మేము తినలేకపోయేవాళ్ళం .బొజ్జ గణపతి మాత్రం అన్ని తినేవాడు చిరు బొజ్జ తో షర్టులేకుండా తిరుగుతుండేవాడు .ఇంట్లో గొడవజరిగినపుడు మాత్రం బిక్కమోహంవేసుకుని చూసేవాడు .సంవత్సరం తరువతనన్నగారికి బదిలీ మీద కొవ్వూరు వేల్లిపోయీము .వచ్చేస్తుంటే అందరుబాధపడ్డారు . ముఖ్యంగా సరోజ తనకిదైర్యాన్ని ఇచ్చే వారు వేల్లిపోతున్నారని బాధపడింది .నేను గణపతిని వదలివేల్లతకి బాదపద్దను . . అయిదు ఏళ్ళ తరవాత పనిమీద , నాన్నగారి ఆఫీసు వాళ్ళు మా ఇంటికి వచ్చేరు .వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉండేవారు ,అమ్మ !గణపతి వాళ్ళు ఎలా వున్నరు అని అడిగింది .ఇంకెక్కడి గణపతి ,మీరు వచ్చేసిన సంవస్తరం తరువాత ఒక తెల్లవారు జమున సరోజ ,గణపతి వారి ఇంటి పెరట్లో వున్నా బావి లో కన్పించారు !అని చెప్పేరు .అందరం షాక్ !

నా గుండె జారిన రోజు

నాన్న గారి ఉద్యోగ రీత్యా చిత్తూర్లో ఉన్నాము .అది అక్టోబరు .స్కూలు నుండి ఇంటికి వచ్చాను.చాలాఆనందంగా ఉన్నాను.ఎందుకంటే ఆ రోజు నా పుట్టినరోజు .స్కూల్లో అందరికి చాక్లెట్లు పంచేసరికి పిల్లలంతా నా చుట్టూ తిరుగుతూ వి.ఐ.పి లా ట్రీట్ చేసారు .ఆ ఆనందం నుండి తెరుకునేలోపే ఇంటికి వచ్చేసా . ఆ రోజుకి ప్రై వేటు డుమ్మా కొడదామనుకున్నా కాని అమ్మ మాత్రం ప్రై వేటు నుండి వచ్చినాకే గుడి కి వేల్దామంది.అది నాకెంతో ఇష్టమైన గుడి . ఇంటికి దగ్గర లోనే కొండ మీద మురుగన్ స్వామి గుడి ఉండేది . ప్రతి పండగకీ ఇంట్లోవారందరం తప్పకుండా దర్సిస్తాం ఆ

ట్యూషన్ కి వెళ్ళాను అన్నాను.మా అమ్మ ట్యూషన్ టీచర్ కి స్వీట్స్ తీసుకుని వెళ్ళమని అన్నది .స్వీట్స్ ఇచ్చేసి ఆవిడ దగ్గర పెర్మిషన్ తీసుకుని వచ్చేద్దామని వెళ్లాను .మా టీచర్ బర్త్ డే విషెస్ లెక్కల పుస్తకం తీయమంది .ఎగ్జామ్స్ వున్నాయి కాబట్టి తప్పదుఅన్నది.నా ఆనందం అంతా ఒక్కసారే ఎగిరిపోయింది.గుడిని.మేమే కాదు ఆ గుడి మా ఊర్లోనే చాలా ఫేమస్ బలవంతాన బుక్ తీశాను ,దూరంగా కొండ మీద నుంచి మురుగన్ స్వామి గుడినుంచి పాటలు వినిపిస్తున్నాయి .అక్కడ పారిజాతం పూల చెట్టు వుంటుంది ,అక్కడ కుప్పలుగా పూలు రాలి పది వుంటాయి .వాటిని ఏరుకుని ఆడుకోవడం నాకు చాల ఇష్టం .అందుకే ముఖ్యంగా గుడి కి వెళ్ళేదాన్ని .నా ఆలోచనలన్నీ గుడి చుట్టూనే తిరుగుతున్నాయి ...ఎప్పుడేపుడుపుస్తకం మూసి ఇంటికి వెళ్తానా అని...టీచర్ మీద చాల కోపంగా వుంది ,ఎలనైతేనేం ట్యూషన్ అయ్యిందనిపించాను .నేను బయలుదేరబోతుండగా టీచర్గారు నాకో ప్యాకెట్ అందించారు ..నాకు ఆశ్చర్యం అక్కడే గబగబా విప్పి చూసాను ,ఆలివ్ గ్రీన్ గోల్డ్ కలర్ అంచు వున్నా ఇంకు పెన్ను ,పెన్సిల్ ఎరైసేర్ ,స్కేల్ ....నేను గాల్లో తెలిపోయాను ,అప్పటిలో ఐదులోకి వస్తే కాని పెన్ ఇచ్చేవారు కాదు ,నేనేమో నాలుగాయే ,నాకంటూ స్వంత పెన్ రావడం ...అబ్బో ఎంత ఆనందమో ....పదేపదే చూసుకున్నాను ..అప్పటివరకు ఆవిడ మీదున్న కోపం ఎగిరిపోయింది.ముందు అక్కవాళ్ళకి చూపించాలి ,థాంక్స్ కూడా చెప్పలేదు ,ఒకటే పరుగు ...ఇంటికేసి ,ట్యూషన్ నుండి కొంత దూరం నడిచి మలుపు తిరిగాను ,ఒక్కసారి మళ్లిపెన్ చూడాలి అనిపించింది ,అప్పుడే చీకటి అలుముకుంటుంది ,బాగ్ నుండి పెన్ తీసి చూసుకుంటున్నాను ,చేతినుండి పెన్ జర్రున జారి పడింది ,నేను కిందకి చుస్తే నేను నిలబడి వున్నది బండరాళ్ళు పరిచి వున్నా డ్రైనేజి ,రాయికి రాయికి మద్య చిన్న సందు ,ఆ సందులోకి నా పెన్ జారిపోయింది .....పెన్ కాదు నా గుండె జారిపోయింది ,చాలాసేపు తొంగి చూసాను ఎక్కడ జాడలేదు ......కళ్ళ లో నీటితో బరువెక్కిన గుండె తో ఇంటికి బయలుదేరాను ....అటు గుడికి చెడ్డాను ..ఇటు పెన్ను దక్కిన్చుకోలేకపోయాను ,కాని ఇంట్లో వాళ్ళతో మాత్రం పోయిన నా పెన్ గురించి వర్ణించి వర్ణించి చెప్పి తృప్తి పడ్డాను .ఆ రోజు మొదలు నేను ట్యూషన్ కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ప్రతిరోజు పెన్ పడ్డ చోటు బండల మద్యలోకి చూసి వెళ్ళేదాన్ని ,ఎప్పటికైనా కనిపిస్తుదేమోనని ...

.